నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నృత్య,గాన సృజనాత్మకతను వెలికితీయడమే తమ లక్ష్యం - థిల్లానా కల్చరల్ సొసైటీ వ్యవస్థాపకులు వెంకటేష్ స్పష్టం - ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు - హాజరైన ట్రాఫిక్ సిఐ గురునాథ్,కలికిరి సీఐ అనిల్ కుమార్ మదనపల్లె : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె నందు థిల్లానా సాంస్కృతిక సంస్థ టాలెంట్ ఎక్స్పో పేరుతో డాన్స్,పెయింటింగ్,సింగింగ్ విభాగాలలో జిల్లాస్థాయి సాంస్కృతిక పోటీలను నిర్వహించింది.దీనికి పిల్లల నుండి మంచి స్పందన లభించింది.శుక్రవారం స్థానిక సొసైటీ కాలనీలో శ్రీ గుడ్ విల్ కంప్యూటర్స్ నందు మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మదనపల్లె ట్రాఫిక్ సిఐ గురునాథ్,కలికిరి సిఐ అనిల్ కుమార్,హెడ్ కానిస్టేబుల్,ప్రముఖ వ్యాఖ్యాత రామ్మూర్తి,థిల్లానా కల్చరల్ సొసైటీ ఫౌండర్ వెంకటేష్,ఉపాధ్యాయుడు బి.వి రమణ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వర్తమాన కాలంలో పిల్లలు సెల్ ఫోన్లకు అలవాటు పడివారిలో వున్న ప్రతిభను మరచితున్నారని గుర్తుచేశారు.వాటి నుండి వారిని దూరం చేయాలనే సదుద్దేశ్యంతో నిర్వహించిన థిల్లానా టాలెంట్ ఎక్స్పోలో పాల్గొని ప్రతిభను చాటి చెప్పిన పిల్లలను అభినందించారు.చెడు వ్యసనాలకు విద్యార్థులు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు.చిన్నతనం నుండే దేశభక్తి సామాజిక స్పృహను,పెంపొందించుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.గుడ్ విల్ కంప్యూటర్స్ వేదికగా థిల్లానా వ్యవస్థాపకుడు వెంకటేష్ ను ప్రసంశించారు.పిల్లలంతా చదువుతో పాటు కలలు,క్రీడలపైన ఆసక్తిని పెంచుకొని రాణించాలని సూచించారు.థిల్లానా కార్య నిర్వాహకులు నాగరాజ్,సురేష్,దిలీప్,జస్వంత్ లు మాట్లాడుతూ థిల్లానా టాలెంట్ ఎక్స్ పోలో మదనపల్లె,గాలివీడు,నూలివీడు,పుంగనూరు ప్రాంతాల నుండి విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు.పిల్లలలో దాగి వున్న ప్రతిభను వెలికితీయడంలో అవకాశాలు కల్పించడంలో థిల్లానా ఎప్పుడు ముందుంటుందని పేర్కొన్నారు.అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలు,సాంస్కృతిక కార్యక్రమాల ప్రోత్సాహానికి తనవంతు సహకారం అందిస్తున్న శ్రీ గుడ్ విల్ కంప్యూటర్స్ అధినేత విజయ్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం ముఖ్య అతిథులు చేతుల మీదుగా విజేతలకు ప్రథమ,ద్వితీయ బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు,శ్రీ గుడ్విల్ కంప్యూటర్స్ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News