నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - జూన్ 29 : తంబళ్లపల్లి నియోజకవర్గంలోని పవిత్ర మల్లయ్య కొండ ప్రాంతంలో మైనింగ్ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ సోమవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో భారీ గిరి ప్రదక్షిణ నిర్వహించారు, ఉదయం 6 గంటలకు మల్లయ్య కొండ ఆలయంలో అభిషేకంతో ఈకార్యక్రమాన్ని ప్రారంభించారు, అనంతరం అనంతరం మల్లయ్య కొండ దిగువన నుంచి గిరి ప్రదక్షిణ గోపిదిన్నె, కొట్టాల క్రాస్, బండ్రేవు, ముసలికుంట, పెద్దమండెం మీదుగా కలిచర్లకు చేరుకుకొని అక్కడ పోలేరమ్మ గుడి వద్ద మధ్యాహ్న సమావేశం అయ్యారు, అనంతరం శివపురం, సిద్ధవరం, వెలిగల్లు, కోటకొండ క్రాస్ మీదుగా తంబళ్లపల్లికి చేరుకొని కార్యక్రమాన్ని ముగించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారాకనాథ్ రెడ్డి మాట్లాడుతూ మైనింగ్ పేరుతో మల్లయ్య కొండను దెబ్బకొట్టాలని చూస్తే మాడి మస్సయిపోతారు అని లక్షలాదిమంది మనోభావాలను దెబ్బతీయాలని ప్రభుత్వం చూస్తోందని.ఇటువంటి అరాచకాలను ఎదుర్కొనేందుకు ఆ శివయ్య ఆశీస్సులతో వైకాపా ఎప్పుడూ ముందుంటుందని హెచ్చరించారు. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి సోదరుడు సుధాకర్ రెడ్డి, నియోజకవర్గంలోని వైకాపా నాయకులు అన్ని మండలాల ప్రజలు, భక్తులు, రైతులు, యువత, మహిళలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Reporter
Namitha News