నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా..పుంగనూరు లో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదం లో గోపిశెట్టి పల్లి కి చెందిన తాపీ మేస్త్రి విశ్వనాతం తన ద్విచక్ర వాహనం లో వస్తుండగా ఆర్టీసీ బస్సు వేగంగా గా డీ కొని విశ్వనాతం గాయపడి మరణించడం జరిగింది.టిడిపి సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు కు విషయం తెలియడం తో టిడిపి నాయకులు సాతార్ల సుబ్రహ్మణ్యం, గంగులప్ప, లక్ష్మి నారాయణ, పెద్ద మోహన్ నాయుడు, గంగరాజు లతో కలసి వెంటనే ఉదయం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కి చేరుకొని విశ్వనాతం మృతదేహం సందర్శించి నివాళులు అర్పించారు.మృతుడు విశ్వనాధం కు భార్య ఇద్దరు కుమారులు కలరు. వృద్యాప్యం లో కొడుకును కోల్పోయిన తండ్రి ని విశ్వనాధం కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సాయం అందించి టిడిపి పార్టీ మీకు అండగా ఉంట్టుందని భరోసా ఇచ్చారు.
Reporter
Namitha News