నమిత న్యూస్ - Andhra Pradesh / శ్రీ బాలాజీ ( తిరుపతి ) : యర్రవారిపాళ్యం - మార్చి 09 : యర్రావారి పాలెం మండలం నెరబైలు సమీపంలో అటవీప్రాంతం కు సమీపం లో నున్న సాయిబూలపల్లె పొలాలకు వేటగాళ్లు తీసిన ఉచ్చు లో పడి రెండు ఏనుగులు మృత్యువాత పడ్డాయి. సోమవారం ఉదయం వెలుగు చూసిన ఘటన పై స్థానికుల తెలిపిన వివరాల మేరకు నెరబైలు అడవికి సమీపం లోని సాయిబూలపల్లి వద్ద వేట గాళ్ళు తీసిన కరెంటు ఉచ్చులో పడి పొలాల్లోకి మేతకు వచ్చిన రెండు ఏనుగులు అక్కడ కరెంటు ఉచ్చులో పడి మృతి చెందినట్లు తెలిపారు. ఎవరైనా వేటగాళ్లు కరెంటు తీయడం వల్లనే ఈ ఘటన జరిగి ఉంటుందని అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు
Admin
Namitha News