నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె పట్టణ సమీపంలోని మడికయ్యల శివాలయం లో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు చేశారు. ఈ కార్యక్రమంలో కురవంక ఎం.పి.టి.సి బెల్లె హారతి, కురవంక మదనపల్లి బెల్లె రెడ్డి ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కురుబ కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం ప్రజలందరికీ శుభాలు, శాంతి, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో భక్తులతో సందడి నెలకొంది.
Reporter
Namitha News