Tuesday, 09 June 2026 09:39:38 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె టిడిపి అధ్యక్ష పీఠం పై పీఠముడి - టీడీపీ ఐ వి ఆర్ సర్వేలో ముగ్గురు పోటీ

ఇద్దరు బిసి, ఓసి పోటా పోటీ

Date : 21 December 2025 06:40 PM Views : 241

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 21 : తంబళ్లపల్లె మండల అధ్యక్ష పీఠం పై అధిష్టానం జాప్యం చేయడంతో పీట ముడి పడింది. తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రం తో పాటు ఎమ్మెల్యే స్థానికంగా ఉండి వైకాపా బలంగా ఉండే మండలంలో టిడిపి అధ్యక్ష పీఠం ఆర్థిక, అంగ, బలమైన వర్గం కలిగిన నాయకుడి ని ఎంపిక చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయమై పార్టీ మండల అధ్యక్ష పీఠానికి ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించి ఐవిఆర్ సర్వే సైతం నిర్వహించింది. మండల అధ్యక్ష, గ్రామ కమిటీ అధ్యక్ష ఎన్నికలు మాజీ టిడిపి ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి సారధ్యంలో జరిగాయి. అనంతరం మరోమారు అబ్జర్వర్లు కొన్ని గ్రామ కమిటీలను మార్చడం పై పార్టీలో గ్రూపు రాజకీయాలు జోరందుకున్నాయి. ఈ మధ్య మల్లయ్య కొండ కింద అధ్యక్ష ఎన్నిక కోసం 12 మంది పోటీ పడడం గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోసినట్లయింది. గత ఎన్నికల్లో వైకాపాను ఎదుర్కొని కష్టపడిన కార్యకర్తలు ఎవరికి వత్తాసు పలకాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ఓవైపు వైకాపా రోజురోజుకు తంబళ్లపల్లె లో బలం పుంజుకున్నట్లు తమ కార్యక్రమాలతో బల ప్రదర్శన చేస్తున్నారు. తంబళ్లపల్లెలో వైకాపాను ఎదుర్కోవాలంటే ఎలాంటి విమర్శలు లేకుండా ఆర్థిక, అంగ, వర్గం కలిగి నిస్వార్ధంగా తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జిగా ఎవరిని నియమించినా పార్టీకి కష్టపడే నాయకుడిని నియమిస్తే తంబళ్లపల్లెలో టిడిపి కి పూర్వ వైభవం ఖాయం. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన టిడిపి అధిష్టానం భేషజాలకు వెళ్లకుండా ఏ నాయకుడిని మండల అధ్యక్షునిగా ఎంపిక చేసినా కష్టకాలంలో పని చేసి నష్టపోయి విసిగి పోయిన మెజారిటీ కార్యకర్తలు ఏకాభిప్రాయం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధిష్టానం మీ నమేషాలు లెక్కించకుండా వర్గ పోరు లేకుండా అందరిని కలుపుకొని పోరాట పటిమ కలిగిన నాయకుడిని ఎంపిక చేసి తంబళ్లపల్లె అధ్యక్ష పదవి ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికల రణ రంగానికి సిద్ధం కావాల్సి ఉంది.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :