నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 21 : తంబళ్లపల్లె మండల అధ్యక్ష పీఠం పై అధిష్టానం జాప్యం చేయడంతో పీట ముడి పడింది. తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రం తో పాటు ఎమ్మెల్యే స్థానికంగా ఉండి వైకాపా బలంగా ఉండే మండలంలో టిడిపి అధ్యక్ష పీఠం ఆర్థిక, అంగ, బలమైన వర్గం కలిగిన నాయకుడి ని ఎంపిక చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయమై పార్టీ మండల అధ్యక్ష పీఠానికి ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించి ఐవిఆర్ సర్వే సైతం నిర్వహించింది. మండల అధ్యక్ష, గ్రామ కమిటీ అధ్యక్ష ఎన్నికలు మాజీ టిడిపి ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి సారధ్యంలో జరిగాయి. అనంతరం మరోమారు అబ్జర్వర్లు కొన్ని గ్రామ కమిటీలను మార్చడం పై పార్టీలో గ్రూపు రాజకీయాలు జోరందుకున్నాయి. ఈ మధ్య మల్లయ్య కొండ కింద అధ్యక్ష ఎన్నిక కోసం 12 మంది పోటీ పడడం గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోసినట్లయింది. గత ఎన్నికల్లో వైకాపాను ఎదుర్కొని కష్టపడిన కార్యకర్తలు ఎవరికి వత్తాసు పలకాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ఓవైపు వైకాపా రోజురోజుకు తంబళ్లపల్లె లో బలం పుంజుకున్నట్లు తమ కార్యక్రమాలతో బల ప్రదర్శన చేస్తున్నారు. తంబళ్లపల్లెలో వైకాపాను ఎదుర్కోవాలంటే ఎలాంటి విమర్శలు లేకుండా ఆర్థిక, అంగ, వర్గం కలిగి నిస్వార్ధంగా తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జిగా ఎవరిని నియమించినా పార్టీకి కష్టపడే నాయకుడిని నియమిస్తే తంబళ్లపల్లెలో టిడిపి కి పూర్వ వైభవం ఖాయం. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన టిడిపి అధిష్టానం భేషజాలకు వెళ్లకుండా ఏ నాయకుడిని మండల అధ్యక్షునిగా ఎంపిక చేసినా కష్టకాలంలో పని చేసి నష్టపోయి విసిగి పోయిన మెజారిటీ కార్యకర్తలు ఏకాభిప్రాయం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధిష్టానం మీ నమేషాలు లెక్కించకుండా వర్గ పోరు లేకుండా అందరిని కలుపుకొని పోరాట పటిమ కలిగిన నాయకుడిని ఎంపిక చేసి తంబళ్లపల్లె అధ్యక్ష పదవి ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికల రణ రంగానికి సిద్ధం కావాల్సి ఉంది.
Reporter
Namitha News