Sunday, 02 August 2026 02:53:07 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

మదనపల్లి పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రథమ కార్తీక వన భోజనం

Date : 16 November 2025 07:20 PM Views : 179

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రథమ కార్తీక వన భోజనం - శ్రీ మృత్యుంజయశ్వర శివాలయం నందు ప్రత్యేక పూజలు - భక్త మార్కండేయ చరిత్ర హరికథ - సాంస్కృతిక కార్యక్రమాలు విజేతలకు బహుమతులు - సంఘం గౌరవ అధ్యక్షులు గుత్తికొండ త్యాగరాజు, అధ్యక్షులు గుత్తి శ్రీరాములు మదనపల్లి నవంబర్ 17, ( బి. శ్రీనివాసులు రెడ్డి తరణం విలేఖరి ) : మదనపల్లి పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రథమ కార్తీక వన భోజన కార్యక్రమం ఆధ్యాత్మిక పండుగ వాతావరణంలో నిర్వహించమని సంఘం గౌరవ అధ్యక్షులు గుత్తికొండ త్యాగరాజు, అధ్యక్షులు గుత్తి శ్రీరాములు తెలిపారు. ఆదివారం స్థానిక అమ్మ చెరువు మిట్ట భరతమాత స్ఫూర్తి కేంద్రం గుట్టపై వెలసిన శ్రీ మృత్యుంజయేశ్వర శివాలయం నందు ప్రత్యేక పూజలు, భక్త మార్కండేయ చరిత్ర హరికథ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కార్తీక వనభోజన కార్యక్రమానికి మదనపల్లి పద్మశాలి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు గుత్తికొండ త్యాగరాజు, అధ్యక్షులు గుత్తి శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి సామల చిన్న వెంకటసుబ్బయ్య, ఉపాధ్యక్షులు ఆమంచి మురళి జింక ఆనంద, కార్యదర్శులు భీమిశెట్టి శంకరనారాయణ, జక్కా రమేష్, సహాయక కోశాధికారి పలవర సురేష్, ప్రచార కార్యదర్శులు గుర్రం ఆదెప్ప, పుత్తా రాజేష్, మరియు కార్యవర్గ సభ్యులు, గౌరవ సలహాదారుల సంయుక్త ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ నలవైపుల నుంచి పద్మశాలీలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని కృపాకటాక్షానికి పాత్రులు కావడం జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలో ఉదయం స్వామి వారికి అభిషేకం, భక్తులకు అల్పాహారం, అనంతరం పద్మశాలి సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం, భాగవతరణి హేమావతి చే భక్త మార్కండేయ చరిత్ర హరికథ కాలక్షేపం, మధ్యాహ్నం కార్తీక వనభోజనాలు, సాంస్కృతిక కార్య క్రమాలు, విజేతలకు బహుమతి ప్రధానం, రాత్రి రఘునాథ స్వామి శిష్య బృందం చే భజనలు కొనసాగాయి. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షులు గుత్తికొండ త్యాగరాజు, అధ్యక్షులు గుత్తి శ్రీరాములు మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో శ్రీ మృత్యుంజయేశ్వర శివాలయం నందు ప్రథమ కార్తీక వనభోజనం కార్య క్రమాన్ని ఏర్పాటు చేయడం,ఈ కార్య క్రమానికి కుల బాంధ వులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయ ప్రదం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా పద్మశాలి సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయడం తో పాటు, హక్కులను సాధించుకోవడానికి కలిసికట్టుగా ముందుకు వెళ్దామని పిలుపు నిచ్చారు. కార్తీక మాసంలో కుల బాంధవులంతా సమావేశమై శ్రీ మృత్యుంజయేశ్వర ఆలయ ప్రాంగణంలో కార్తీక్ వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, అభివృద్ధిపై చర్చించు కోవడం కార్తీకదీపం వెలిగించి దైవ కృపకు పాత్రలు కావడం, ఆధ్యాత్మిక వాతావరణం లో వేడుకలు జరుపు కోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే తరహాలో సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడం తో పాటు, యువతలో ఆధ్యాత్మిక భావనలను పెంపొందించి సన్మార్గంలో నడిపించ డానికి ఇలాంటి కార్య క్రమాలు ఎంతో దోహద పడతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి అన్నారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను, సృజనాత్మ కతను వెలికి తీసి ప్రోత్సహించే దిశగా విజేతలకు బహుమతులు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమం లో సంఘం గౌరవ సలహాదారులు తిరువీధి మురహరి, చేవూరి నాగరాజు, జింకా వెంకటరమణ, గుణి శెట్టి లక్ష్మీనారాయణ, చెన్నా భాస్కర్, కార్యవర్గ సభ్యులు బోగా గోపాలరావు, మంచి మధు, చెన్నా ఆది నారాయణ, ఇంజమూరి విశ్వనాధ్, పొలంకి రెడ్డెప్ప, గుత్తి రాజా, సుధా రెడ్డి శేఖర్, ఉట్ల శంకర నారాయణ, జనగం కృష్ణ తో పాటు కమిటీ సభ్యులు, పద్మశాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: