Friday, 31 July 2026 07:35:59 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

నేటి తరం స్ఫూర్తిప్రదాత దామోదరం సంజీవయ్య

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకలు

Date : 14 February 2026 12:16 PM Views : 207

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - ఫిబ్రవరి 14 : తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు, నిరాడంబరతకు మారుపేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ దామోదరం సంజీవయ్య గారి 105వ జయంతి వేడుకలు శనివారం రాయచోటిలోని పోలీస్ కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (అడ్మిన్) శ్రీ వి.జె. రామకృష్ణ గారు సంజీవయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (అడ్మిన్) రామకృష్ణ గారు మాట్లాడుతూ.. సమాజం కోసం అంకితభావంతో పనిచేసిన ఇలాంటి మహనీయుల జయంతి వేడుకలను జరుపుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. కేవలం 38 ఏళ్లకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఘనత సంజీవయ్య గారిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా సేవలు అందించి, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారు. 1938లో ఎస్.ఎస్.ఎల్.సి లో కర్నూలు జిల్లాలోనే ప్రథముడిగా నిలిచిన ఆయన, నేటి విద్యార్థులకు, యువతకు గొప్ప రోల్ మోడల్. సంయుక్త మద్రాసు రాష్ట్రంలోనూ, కేంద్ర ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేశారని ఆర్.ఐ. కొనియాడారు. ఈ వేడుకల్లో రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె.సురేష్ కుమార్ రెడ్డి, ఆర్ఎస్ఐలు ఎ. శ్రీనివాస్, జి. రవి. పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొని సంజీవయ్య గారికి అంజలి ఘటించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని ప్రతినబూనారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: