నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - ఏప్రిల్ 02 : ఆత్మకూరు జిల్లాలో సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఉపయోగకరమైన సమాచారం అందిస్తున్న జిల్లాకు చెందిన 6 మందిని ఎంపిక చేసి నేడు వింజమూరుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో భేటీ నిర్వహించారు. అందులో మెట్ట ప్రాంతం ఆత్మకూరుకు చెందిన చల్ల.మదన్ మోహన్ అనే మన ఆత్మకూరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో మాట్లాడే అవకాశం లభించింది.. ఈ సందర్భంగా వీరితో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా గంటసేపు వివిధ అంశాలపై చర్చించారు.. అందులో సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలుపుతున్న అంశాలను దీని ద్వారా లభించే ఉపాధి అవకాశాలు, వీరి నుండి ప్రజలు తెలుసుకుంటున్న అంశాలను ముఖ్యమంత్రి వీరితో చర్చించారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలు గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని వీరితో మాట్లాడారు.. మరోసారి తనను కలవాలని వీరికి తెలిపారు
Admin
Namitha News