Thursday, 16 April 2026 04:25:13 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

భూ వివాదంతో ఉద్రిక్తత, ఇరువర్గాలపై కేసులు నమోదు

ఇరువర్గాలను తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేసిన యస్.ఐ. రమేష్ బాబు

Date : 11 November 2025 11:45 PM Views : 133

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్11 : రామసముద్రం మండలం, అరికెల పంచాయతీలోని చిట్టెం వారి పల్లి, కమ్మవారిపల్లె లలో ఎస్సై రమేష్ బాబు మంగళవారం రెండు గ్రామ పంచాయతీలలో పర్యటించి భూసమస్యలకు సంబందించిన ఇరువర్గాలకు పరస్పర అవగాహన కల్పించారు. భూమి వివాదంలో ఉద్రిక్తత చోటుచేసుకుని రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా సాగుతున్న విభేదాలు ఇటీవల తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో కేసు, కౌంటర్ కేసులు రామసముద్రం పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యాయి. శాంతిభద్రతలు కాపాడడంలో భాగంగా, నేడు ఇరు వర్గాల నలుగురిని రామసముద్రం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. రెండు ఘటనలకు సంబందించిన భూ సమస్యలపై ఎస్సై రమేష్ బాబు మాట్లాడుతూ భవిష్యత్తులో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడరాదని, గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేలా సహనం, అవగాహనతో వ్యవహరించాలని గ్రామస్తులను ఆయన హెచ్చరించారు.ఏవైనా సమస్యలు ఉంటే మాదృష్టికి, రెవిన్యూ అధికారులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్ బాబు, సిబ్బంది భరత్ రెడ్డి రైతులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :