నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్11 : రామసముద్రం మండలం, అరికెల పంచాయతీలోని చిట్టెం వారి పల్లి, కమ్మవారిపల్లె లలో ఎస్సై రమేష్ బాబు మంగళవారం రెండు గ్రామ పంచాయతీలలో పర్యటించి భూసమస్యలకు సంబందించిన ఇరువర్గాలకు పరస్పర అవగాహన కల్పించారు. భూమి వివాదంలో ఉద్రిక్తత చోటుచేసుకుని రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా సాగుతున్న విభేదాలు ఇటీవల తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో కేసు, కౌంటర్ కేసులు రామసముద్రం పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. శాంతిభద్రతలు కాపాడడంలో భాగంగా, నేడు ఇరు వర్గాల నలుగురిని రామసముద్రం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. రెండు ఘటనలకు సంబందించిన భూ సమస్యలపై ఎస్సై రమేష్ బాబు మాట్లాడుతూ భవిష్యత్తులో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడరాదని, గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేలా సహనం, అవగాహనతో వ్యవహరించాలని గ్రామస్తులను ఆయన హెచ్చరించారు.ఏవైనా సమస్యలు ఉంటే మాదృష్టికి, రెవిన్యూ అధికారులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్ బాబు, సిబ్బంది భరత్ రెడ్డి రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News