Thursday, 16 April 2026 03:14:43 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

టిడిపి నాయకులు ఐకమత్యం తో పార్టీకి అండగా నిలవాలి - కట్టా దొరస్వామినాయుడు

Date : 12 April 2026 09:15 PM Views : 67

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 12 : తంబళ్లపల్లె లోని టిడిపి నాయకులు, కార్యకర్తలు విభేదాలు పక్కన పెట్టి ఐకమత్యంతో పార్టీకి అండగా నిలవాలని టిడిపి నియోజకవర్గ స్థాయి నాయకుడు కట్టా దొరస్వామి నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం తంబళ్లపల్లె మండల కేంద్రం సమీపంలోని ఎగువ బోయపల్లెలో కొడిగి మల్లికార్జున, కృష్ణమాచారి లా ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు కట్టాదొరస్వామి నాయుడుకు పూలమాలలు, దృశ్యాలవులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన టిడిపి నాయకులకు కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ తంబళ్లపల్లె టిడిపికి అధిష్టానం త్వరలో ప్రజామోదం పొందిన నాయకుడిని ఎంపిక చేస్తారని కార్యకర్తలు అధైర్య పడాల్సిన పనిలేదని సమన్వయం పాటించి వర్గ విభేదాలు లేకుండా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సీఎం చంద్రబాబు నాయుడు కూటమిపాలనలో రాష్ట్రం స్వర్ణాంధ్ర వైపు పరుగులు పెడుతుందని ప్రశంసించారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ అమలుతోపాటు రాష్ట్రానికి రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం పరుగులు, విద్య, వైద్యం అన్ని రంగాలలో రాష్ట్రాన్ని దేశంలోని మొదటి స్థానంలో నిలవడం ఖాయం అన్నారు. తంబళ్లపల్లె టిడిపి నాయకులు కార్యకర్తలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి కృషి చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని ప్రతి కార్యకర్త పార్టీ ఆదేశాలకు కట్టుబడి అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి సహకరించాలని కోరారు. ఆయన వెంట మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :