Thursday, 30 July 2026 04:56:07 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

J.R. పేటలో నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం

కృతఙ్ఞతలు తెలిపిన స్థానికులు

Date : 30 January 2026 07:45 PM Views : 149

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - జనవరి 30 : పట్టణంలోని నాలుగవ వార్డు పరిధిలో జేఆర్ పేట నందు విద్యుత్ సమస్యలను నివారించే క్రమంలో నూతన ట్రాన్స్ఫారం ఏర్పాటు చేశారు.. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని కలిసి ట్రాన్స్ఫార్మర్ మంజూరు కొరకు విజ్ఞప్తి చేయగా వారి సహకారంతో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసినట్లు స్థానిక నివాసి 20వ వార్డు కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి తెలిపారు.. ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి వేగవంతంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుచేసిన విద్యుత్ శాఖ ఏడిఈ చిన్నస్వామి నాయక్, పట్టణ ఏఈ జమీల బేగం ఇతర విద్యుత్ సిబ్బంది కు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.. మొదట ట్రాన్స్ఫార్మర్ కు పూజా కార్యక్రమం నిర్వహించారు.. అనంతరం ట్రాన్స్ఫార్మర్ ను ఏడిఈ చిన్నస్వామి నాయక్ ఆన్ చేసి విద్యుత్ సరఫరాను కొనసాగించారు. ఈ కార్యక్రమానికి వీధివాసులు హాజరయ్యారు.. తమ ప్రాంతంలోని లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించి నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసినందుకు విద్యుత్ అధికారులకు వీరు ధన్యవాదాలు తెలిపారు.. ఏడిఈ చిన్నస్వామి నాయక్ మాట్లాడుతూ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలోని సుమారు 150 ఇళ్లకు లో వోల్టేజ్ విద్యుత్ సమస్య తీరిందని త్వరలో పట్టణంలోని మరో మూడు ప్రాంతాలలో నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :