Thursday, 16 April 2026 03:18:35 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

భగత్ సింగ్ కాలనీ లో పోలీసుల కార్డ్ ఆన్ సెర్చ్ తో అణువణువూ జల్లెడ

Date : 11 April 2026 02:48 PM Views : 77

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 11: శనివారం వేకువజామున సూర్యకిరణాలు సరిగ్గా నేలను తాకకముందే పుంగనూరు పట్టణం లోని భగత్ సింగ్ కాలనీ లో ఒక్కసారిగా ఖాకీల పహారా లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు

జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో మదనపల్లి సబ్ డివిజన్ పోలీసు యంత్రాంగం అలికిడి లేకుండా కాలనీని చుట్టుముట్టింది. నేర రహిత సమాజమే లక్ష్యంగా చేపట్టిన ఈ 'కార్డ ఆన్ సెర్చ్' ఆపరేషన్, అణువణువునూ జల్లెడ పట్టారు. సుమారు 50 మంది పోలీసు సిబ్బంది బృందాలుగా విడిపోయి, కాలనీలోని ప్రతి సందును, ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరించడంతో పాటు, సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించేందుకు రికార్డులను పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా అత్యంత వ్యూహాత్మకంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. సోదాల అనంతరం పుంగనూరు అర్బన్ సీఐ సుబ్బరాయుడు కాలనీ వాసులకు కౌన్సిలింగ్ ఇస్తూ వారికి భద్రతపై భరోసా కల్పిస్తూ మీ భద్రతే మా ప్రాధాన్యత, మీ వీధిలో అపరిచితులు తచ్చాడుతున్నా, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా వెనుకాడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు. ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు అద్దెదారుల వివరాలు ఆరా తీయాలని, వేసవి కాలంలో ఇంటి జాగ్రత్తలు తీసుకోవాలని, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చని అవగాహన కల్పించారు

ఆపరేషన్‌లో పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ గారితో పాటు ఎస్సైలు అన్సార్ బాషా, రమణ, చంద్రశేఖర్, రమేష్ తమ సిబ్బందితో కలిసి ప్రతి ప్రాంతాన్ని పర్యవేక్షించారు. సుమారు 50 మందికి పైగా సిబ్బంది ఏకకాలంలో రంగంలోకి దిగి కార్డ్ ఆన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :