నమిత న్యూస్ - Andhra Pradesh / గుంటూరు : మంగళగిరి - నవంబర్ 21 : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లాలని విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు తెలియజేసినట్లు చమర్తి తెలిపారు. శుక్రవారం నాడు ఉండవల్లి లోని ముఖ్యమంత్రి నివాసం నందు మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారిని రాజంపేట తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు - నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై ఆయనతో చర్చించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తూ,ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి,పథకాల ద్వారా లబ్ధి పొందే వారికి జరిగే మేలును వివరించి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా కృషి చేయాలని శ్రీ నారా లోకేష్ బాబు గారు సూచించారని చమర్తి జగన్ మోహన్ రాజు గారు తెలియజేశారు.
Reporter
Namitha News