Friday, 31 July 2026 11:01:31 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

కాలుష్య నియంత్రణ మనందరి బాధ్యత

మిట్స్ అమెరికన్ సొసైటీ అఫ్ సివిల్ ఇంజనీర్స్ స్టూడెంట్స్ చాప్టర్ మరియు ఏపి కాలుష్యం నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం

Date : 22 February 2026 05:33 PM Views : 185

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఫిబ్రవరి 22 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు సివిల్ ఇంజనీరింగ్ విభాగం వారు మిట్స్ అమెరికన్ సొసైటీ అఫ్ సివిల్ ఇంజనీర్స్ స్టూడెంట్స్ చాప్టర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, కడప వారి ఆధ్వర్యంలో “కాలుష్య నియంత్రణ – మనందరి బాధ్యత” అనే అంశంపై అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కాలుష్య నియంత్రణ మండలి కడపకు చెందిన పర్యావరణ ఇంజనీర్ శ్రీమతి కె. సుధ పాల్గొన్నారు.కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా ప్రతి ప్రాంతంలో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాన్ని ప్రతి నెల మూడవ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కాలుష్య నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయని, ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం మరియు రీసైక్లింగ్ ప్రక్రియలను ప్రోత్సహించడం ద్వారా కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు. సాంకేతికంగా అభివృద్ధి చెందడం ఎంత ముఖ్యమో, అంతే బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ పట్ల విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కాలుష్యం పెరిగితే అనేక వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, కరోనా వంటి మహమ్మారులు కూడా పర్యావరణ అసమతుల్యతకు ఉదాహరణలని అన్నారు. విద్యార్థులకు శబ్ద కాలుష్యం, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం వంటి వివిధ రకాల కాలుష్యాల వల్ల కలిగే హానికర ప్రభావాల పై అవగాహన కల్పించి, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీన్-స్కూల్ అఫ్ కంప్యూటింగ్ డాక్టర్ దీపాంకర్ రాయ్, విభాగాధిపతి డాక్టర్ విజయ్ కుమార్ నటేశన్, డాక్టర్ ఏ.వి పవన్ కుమార్, యూనివర్సిటీ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :