Thursday, 30 July 2026 11:30:44 PM
# నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు

మిట్స్ విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య లో ఆవిష్కరణలు, వ్యాపారోత్పత్తి పై అవగాహన

Date : 17 March 2026 07:59 PM Views : 183

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 17 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ మరియు డేటా సైన్స్) విభాగాల వారు సంయుక్తంగా ఏఐసిటిఈ (అఖిల భారత సాంకేతిక విద్యా మండలి), న్యూ ఢిల్లీ వారి సహకారంతో ఇంజినీరింగ్ విద్యలో ఆవిష్కరణలు మరియు వ్యాపారోత్పత్తి అభివృద్ధి అనే అంశం పై ఒక రోజు సాంకేతిక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడుకు చెందిన అన్న యూనివర్సిటీ నందు మెకానికల్ విభాగం లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఎమ్.సత్య ప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఇంజినీరింగ్ విద్య కేవలం తరగతి గది పాటలకే పరిమితం కాకుండా, ఆవిష్కరణలు మరియు వ్యవస్థాపకత కేంద్రంగా సరికొత్త దిశలో ముందుకు సాగాలని అన్నారు. నేటి ఇంజినీర్లు కేవలం డిగ్రీలు పొందే వారు మాత్రమే కాకుండా, సమాజంలోని సంక్లిష్ట సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను కనుగొనే దిశగా ముందుకు సాగాలని అన్నారు. హ్యాకథాన్‌లు మరియు డిజైన్ థింకింగ్ వంటి వేదికల ద్వారా విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలను ప్రాథమిక నమూనాలుగా అభివృద్ధి చేయాలని అన్నారు. విదేశీ సాంకేతికతలను అనుసరించడం కంటే భారతీయ పరిస్థితులకు అనుగుణంగా, అవసరాలకు సరిపోయే విధంగా, తక్కువ ఖర్చుతో, స్థిరమైన పరిష్కారాలను రూపొందించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. భారతీయ పరిస్థితులకు సరిపోయే సాంకేతికతలను అభివృద్ధి చేయడం ద్వారా దేశం స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకు సాగుతుందని తెలుపారు. ఈ ప్రక్రియలో మిట్స్ యూనివర్సిటీ నందు బిజినెస్ ఇంక్యుబేటర్లు మరియు స్టార్టప్ హబ్‌లు విద్యార్థులకు మార్గదర్శకత్వం మరియు అవసరమైన వనరులు అందిస్తూ సాంకేతిక ప్రాజెక్టులను లాభదాయకమైన వ్యాపారాలుగా మార్చడంలో సహకరిస్తున్నాయని అన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కృత్రిమ మేధ (AI), గ్రీన్ ఎనర్జీ మరియు సెమీకండక్టర్ల వంటి ఆధునిక రంగాల అభివృద్ధికి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, డీన్-స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ చంద్ర ప్రకాష్ గుప్తా , విభాగాధిపతులు డాక్టర్ ఆర్ కల్పనా, ఎస్.కుసుమ, కోఆర్డినేటర్ డాక్టర్ ఏ.పుంగోదై, డాక్టర్ కె.నిర్మల దేవి, డాక్టర్ చొక్కనాథన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :