Thursday, 30 July 2026 07:49:31 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కరాటేలో విజయభారతి విద్యార్థుల విజయదుందుభి

ప్రథమ,ద్వితీయ,తృతీయ స్థానాలు కైవసం - అభినందించిన కరస్పాండెంట్ డాక్టర్ ఎన్.సేతు

Date : 24 November 2025 07:40 PM Views : 186

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కరాటేలో విజయభారతి విద్యార్థుల విజయదుందుభి - ప్రథమ,ద్వితీయ,తృతీయ స్థానాలు కైవసం - అభినందించిన కరస్పాండెంట్ డాక్టర్ ఎన్.సేతు మదనపల్లె : ప్రతిభతోపాటు పతకాలు సాధించినప్పుడే కరాటే విద్యార్థులకు తగిన గుర్తింపు వస్తుందని విజయభారతి స్కూల్ చైర్మన్ డాక్టర్ యన్.సేతు పేర్కొన్నారు.కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో జరిగిన ఒకినవా గోజు రియు కరాటే డూ ఫెడరేషన్ మలేషియా వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ - 2025 పోటీలు జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యస్.యస్.కే గోజు రియు కరాటే డో ఇండియా వ్యవస్థాపకులు క్యోషి యమ్ కన్నన్ పాల్గొన్నారు.ఇందులో మదనపల్లి పట్టణంలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు సత్తాచాటారు.ఈ సందర్భంగా కరాటే మాస్టర్ యం.మణిసాయి మాట్లాడుతూ ఛాంపియన్షిప్ నందు 13 సంవత్సరాల సీనియర్ బాయ్స్ కటా విభాగంలో కే.చరణ్ తేజ,సి.గౌతమ్ నంద,వై.గీర్వన్,అర్.ధనుష్ రెడ్డి ప్రథమ స్థానంలో నిలిచారు.ఆదేవిధంగా 12 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో యమ్.కార్తికేయ ప్రథమ స్థానం,10 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో కే.యస్వంత్ తేజ్ ప్రథమ స్థానం,13 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో యస్.మహేశ్వర్ ప్రథమ స్థానం,12 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో యమ్.కార్తికేయ ప్రథమ స్థానం,12 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో వి.రేవంత్ ద్వీతీయ స్థానం,12 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో పి.చందన్ ద్వీతీయ స్థానం 12 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో ఏ.గగన్ ద్వీతీయ స్థానం,12 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో పి.హేమంత్ ద్వీతీయ స్థానం,11 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో ఏ.హరీష్ రెడ్డి ద్వీతీయ స్థానం,12 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో యమ్.రిషికేష్ గౌడ్ తృతీయ స్థానం,13 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో జి. ప్రేమ్ సందీప్ తృతీయ స్థానం,11 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో ఏ.జఫ్ఫార్ తృతీయ స్థానం,12 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో జె. రోహిత్ తృతీయ స్థానం,13 సంవత్సరాల బాయ్స్ కటా విభాగంలో వరుణ్ తెజ్ తృతీయ స్థానం అందుకున్నరు.విద్యార్థులకు యస్.యస్.కే గోజు రియు కరాటే డో ఇండియా వ్యవస్థాపకులు క్యోషి యమ్ కన్నన్ చేతుల మీదుగా బహుమతులు,ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గ్రాండ్ మాస్టర్ స్వర్గీయ డాక్టర్ ఎఆర్.సురేష్ శిక్షణ మరియు ఆశీస్సులతో మాకు సాధ్యమయిందని యూత్ కరాటే క్లబ్ ప్రెసిడెంట్ రెన్షి యం.మణిసాయి పేర్కొన్నారు.ఈ సందర్భంగా విజయ భారతి హైస్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ ఎన్.సేతు మాట్లాడుతూ ఆత్మరక్షణ విద్య విద్యార్థుల శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా ఆత్మస్థైర్యాన్ని నింపుతుందన్నారు.కరాటే మాస్టర్ మణిసాయి శిక్షణలో తమ విద్యార్థులు రాణించడం శుభపరిణామన్నారు.ఇదే స్ఫూర్తితో రాష్ట్ర,జాతీయస్థాయి కరాటే పోటీలలో విద్యార్థులు రాణించి మదనపల్లి కీర్తిప్రతిష్టలు పెంచాలని ఆయన ఆకాంక్షించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :