నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 29 ః తంబళ్లపల్లె జూనియర్ కళాశాల ఎన్.ఎస్.ఎస్. విద్యార్థిని విద్యార్థుల స్పెషల్ క్యాంపులో భాగంగా చేపట్టిన సేవా కార్యక్రమం ప్రశంసనీయమని ఎంపీడీవో కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ థామస్ రాజా కొనియాడారు. శనివారం ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు ఎంపీడీవో, ఐకెపి, హౌసింగ్, ఉపాధి హామీ కార్యలయ ఆవరణాలలో పేరుకుపోయిన పిచ్చిమొక్కలు, చెత్త చెదారం శుభ్రం చేశారు. ఈ సందర్బంగా ఏపీవో అంజనప్ప, ఏపీఎం గంగాధర్, హౌసింగ్ ఏఈ సుజాత, కార్యదర్శి శ్రీనివాసరావు లు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, విద్యార్థుల శ్రమధానం అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ నాయక్, టైపిస్ట్ సురేంద్ర, జూనియర్ అసిస్టెంట్ విజయ్, నాగరాజు, సి.సిలు కత్తి నరసింహులు, రమణ పద్మావతి, ఖయ్యూం, భాస్కర్ లు పాల్గొన్నారు.
Reporter
Namitha News