నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 06 : మదనపల్లి పట్టణం, మండలం లోని 12 మంది లబ్ధిదారులు వివిధ రకాల అనారోగ్య సమస్యతో కార్పొరేట్ వైద్యం చేయించుకొన్న లబ్దిదారులు ఆర్థిక భరోసా కు దరఖాస్తు చేసుకోగా వారి వినతులను పరిశీలించిన తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని వారికి భరోసా కల్పిస్తూ సియం సహాయ నిధి నుండి 12 మంది లబ్దిదారులకు కలిపి 11.75 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం తో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాష నేడు లబ్దిదరుల ఇంటి ఇంటికీ వెళ్లి స్వయం గా చెక్కులను అందజేసారు. కోళ్ల బైలు, బసినికొండ, కొత్త ఇండ్లు పంచాయతీ లోని లబ్ధిదారులకు చెక్కులను అందచేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నియోజవర్గం పరిధిలో ఇప్పటివరకు 6 కోట్ల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందించామని, నేడు 11.75 లక్షల రూపాయల చెక్కులను అందించడం జరిగిందని, తెలుగుదేశం పార్టీ పేదల పక్షాన ఉంటుందని చెప్పడానికి ఇదే నిదర్శనం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్ చౌదరి, దొరస్వామి నాయుడు, జెసిబి వేణు, జాఫరున్నిస, శ్రీరామ నాగమణి, లాల్ బాషా, రెడ్డి రాయల్, చల్లా, శ్రీనివాస్ నాయుడు, రమేష్ రెడ్డి, టైగర్ సురేందర్ రెడ్డి, బాలమణి శేఖర్, స్థానిక తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు
Reporter
Namitha News