Tuesday, 09 June 2026 08:26:41 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

ఏపీఎస్పీడిసిఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యుత్ ప్రాజెక్టు పనులపై దృష్టి సారించాలి - కలెక్టర్ నిశాంత్ కుమార్

మదనపల్లి కేంద్రంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు 30 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేటాయింపును కోరిన జిల్లా కలెక్టర్

Date : 21 January 2026 05:32 PM Views : 154

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 21 : ఏపీఎస్పీడిసిఎల్, నెడ్ క్యాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యుత్ ప్రాజెక్టు పనులకు సంబంధించిన అన్నిరకాల పెండింగ్ ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబందిత అధికారులను ఆదేశించారు. బుధవారం తిరుపతిలోని ఏపీఎస్పీడిసిఎల్ సిఎండి ఛాంబర్ లో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్. ఎపిఎస్పిడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి తో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి విద్యుత్, సోలార్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిపై ఏపీఎస్పీడిసిఎల్ సర్కిల్ పరిధిలోని ప్రాంతీయ జిల్లాల కలెక్టర్లు, సంబందిత ఎస్ఈ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మదనపల్లె కలెక్టరేట్ నుండి హాజరయి జిల్లాలో సోలార్ పవర్ ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి వివరించారు. మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు అనంతరం గతంలో అన్నమయ్య జిల్లాకు కేటాయించబడిన 19 మెగావాట్ల విద్యుత్ ప్రస్తుతం కడప జిల్లాకు మార్చబడినందున మదనపల్లి కేంద్రంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు కనీసం 30 మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యాన్ని కేటాయించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించి భూమిని గుర్తించి నివేదికలు పంపాలని సూచించారు. సీఎస్ విసి ముగిసిన ఆనంతరం.. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎం కుసుం పురోగతి, పీఎం-సూర్య ఘర్ పురోగతి, తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు, సూచనల మేరకు.. 2026 డిసెంబర్ నాటికి పిఎం కుసుమ్ పథకం ద్వారా అభివృద్ధి చేస్తున్న ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ (ఎఫ్.ఎల్.ఎస్.) కు సంబంధించి భూసేకరణ ప్రక్రియ, ఫీడర్ల ఏర్పాటు తదితర పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఏపీఎస్పీడిసిఎల్ అధికారి సోమశేఖర్, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :