Thursday, 16 April 2026 04:23:51 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

ఏపీఎస్పీడిసిఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యుత్ ప్రాజెక్టు పనులపై దృష్టి సారించాలి - కలెక్టర్ నిశాంత్ కుమార్

మదనపల్లి కేంద్రంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు 30 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేటాయింపును కోరిన జిల్లా కలెక్టర్

Date : 21 January 2026 05:32 PM Views : 107

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 21 : ఏపీఎస్పీడిసిఎల్, నెడ్ క్యాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యుత్ ప్రాజెక్టు పనులకు సంబంధించిన అన్నిరకాల పెండింగ్ ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబందిత అధికారులను ఆదేశించారు. బుధవారం తిరుపతిలోని ఏపీఎస్పీడిసిఎల్ సిఎండి ఛాంబర్ లో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్. ఎపిఎస్పిడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి తో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి విద్యుత్, సోలార్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిపై ఏపీఎస్పీడిసిఎల్ సర్కిల్ పరిధిలోని ప్రాంతీయ జిల్లాల కలెక్టర్లు, సంబందిత ఎస్ఈ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మదనపల్లె కలెక్టరేట్ నుండి హాజరయి జిల్లాలో సోలార్ పవర్ ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి వివరించారు. మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు అనంతరం గతంలో అన్నమయ్య జిల్లాకు కేటాయించబడిన 19 మెగావాట్ల విద్యుత్ ప్రస్తుతం కడప జిల్లాకు మార్చబడినందున మదనపల్లి కేంద్రంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు కనీసం 30 మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యాన్ని కేటాయించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించి భూమిని గుర్తించి నివేదికలు పంపాలని సూచించారు. సీఎస్ విసి ముగిసిన ఆనంతరం.. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎం కుసుం పురోగతి, పీఎం-సూర్య ఘర్ పురోగతి, తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు, సూచనల మేరకు.. 2026 డిసెంబర్ నాటికి పిఎం కుసుమ్ పథకం ద్వారా అభివృద్ధి చేస్తున్న ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ (ఎఫ్.ఎల్.ఎస్.) కు సంబంధించి భూసేకరణ ప్రక్రియ, ఫీడర్ల ఏర్పాటు తదితర పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఏపీఎస్పీడిసిఎల్ అధికారి సోమశేఖర్, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :