Thursday, 30 July 2026 07:51:20 PM
# నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం..

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో ఏంట్రాప్రేన్యూర్షిప్ పై అవగాహనా కార్యక్రమం

కేంద్ర సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహకారం

Date : 13 November 2025 08:30 PM Views : 159

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 13 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగం వారు మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ వారి సహకారంతో ఎంట్రప్రెన్యూర్షిప్ పై అవగాహన కార్యక్రమాన్నినిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హైదరాబాద్ కు చెందిన నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, డిప్యూటీ మేనేజర్ పి.అబ్దుల్ ఖాదర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేటి వేగవంతమైన సాంకేతిక మరియు ఆర్థిక ప్రపంచంలో, ఉద్యోగాల కోసం ఎదురుచూడటం కంటే స్వయంగా ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం అత్యంత అవసరం అని అన్నారు. ఎం బి ఏ తరువాత చాలా మంది విద్యార్థులు ఉద్యోగం కోసం వెళుతున్నారని, కొద్ది మంది మాత్రమే పరిశ్రమలు పెట్టి జీవనోపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. ఒక పరిశ్రమ ఏర్పాటు చెయ్యాలంటే ఎంటువంటి జాగ్రత్త లు తీసుకోవాలి అనే అంశాలపైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఆర్ధిక పరమైన సహాయసహకారాలు అందిస్తున్నాయని అన్నారు. పరిశ్రమల్లో తయారు చేసే వస్తువు నాణ్యత, మార్కెటింగ్ మరియు వినియోగదారుడి అభిరుచికి తగినట్టు ఎలా తయారు చేసేలా మన ఆలోచన దృష్టిలో పెట్టుకోవాలి అని తెలిపారు. అదే విదంగా మనం తయారు చేసిన వస్తువుకు, మిగతా వాటికీ ఉన్న తేడా కూడా పరిశ్రమ విజయానికి దోహదపడుతుంది అని తెలిపారు. ఏ వ్యాపారం అయిన లాభాల బాటలో ముందుకు వెళ్ళాలి అంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో మన వస్తువు ధర, నాణ్యత ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో డీన్ స్కూల్ అఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి, కో-ఆర్డినేటర్ డాక్టర్ గీత దేవి, ఈడి సెల్ కో ఆర్డినేటర్ డాక్టర్ కె. శిరీష, కో-కోర్డినేటర్ డాక్టర్ జగన్ నాథ్, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :