Friday, 31 July 2026 08:50:51 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

టీబీ ముక్త్ భారత్ అభియాన్‌కు శ్రీకారం - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం పోస్టర్ల విడుదల

Date : 23 March 2026 08:55 PM Views : 301

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 23: అన్నమయ్య జిల్లాలో క్షయ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి, సమర్థవంతమైన చికిత్స అందించడం ద్వారా టిబి వ్యాధిని పూర్తిగా నిర్మూలించి... క్షయ వ్యాధి రహిత జిల్లాగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా, మార్చి 24, 2026 నుండి ప్రారంభమవుతున్న టీబీ ముక్త్ భారత్ అభియాన్ – 100 రోజుల కార్యక్రమం పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం కలెక్టర్ కార్యాలయం పిజిఆర్ఎస్ సమావేశ మందిరం లో క్షయ వ్యాధి రహిత ప్రచార పోస్టర్లను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులతో కలిసి విడుదల చేశారు

ఈ 100 రోజుల కార్యక్రమాన్ని జిల్లాలో మూడు దశల్లో అమలు చేయనున్నట్లు కలెక్టర్ వివరించారు . హై రిస్క్ గ్రామాలు, కాంగ్రీగేట్ ప్రదేశాలు మరియు వల్నరబుల్ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని స్క్రీనింగ్ నిర్వహించ బడుతుంది. ప్రతిరోజు ఒక హై రిస్క్ గ్రామంలో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తూ అన్ని గ్రామాలను కవర్ చేయడం లక్ష్యంగా నిర్ణయించారు. శిబిరాల్లో ఛాతీ ఎక్స్-రే సహా అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించబడతాయి. స్క్రీనింగ్ చేసిన ప్రతి వ్యక్తి వివరాలను నిక్షయ్ పోర్టల్‌లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డిఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మి నరసయ్య, అదనపు డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ రాధిక మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :