Thursday, 16 April 2026 04:22:21 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా 8 ఎలక్ట్రికల్ ఈ-ఆటోలు పంపిణీ చేసిన జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్

Date : 12 January 2026 06:16 PM Views : 119

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 12 : గ్రామాలను పరిశుభ్రంగా చేసి ఉంచడం, ఇంటింటి చెత్త సేకరణను సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్వర్ణ ఆంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా మంజూరైన ఎనిమిది ఎలక్ట్రికల్ ఆటోలను పాత అన్నమయ్య జిల్లా ప్రతిపాదన లో భాగంగా చిన్నమండెం మండలం పడమటి కోన పంచాయితీ, ఓబుల్ వారి పల్లి మండలం ఓబులవారిపల్లి పంచాయతీకి, వీరబల్లి మండలం ఓడివీడు పంచాయతీకి, కలికిరి మండలం పాతేగడ పంచాయతీ , అద్దావారిపల్లి పంచాయతీకి, మదనపల్లి మండలం కొత్త ఇండ్లు పంచాయతీ, తంబళ్లపల్లి మండలం పారతోపు పంచాయతీ, సంబేపల్లి మండలం సంబేపల్లి గ్రామ పంచాయతీ, ఈ–ఆటోలను గ్రామ పంచాయతీలకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి సంయుక్తంగా పంచాయతీలకు పంపిణీ చేశారు. మొత్తం 8 ఎలక్ట్రికల్ ఈ–ఆటోలను అందజేశారు.ఒక్కో ఈ–ఆటో విలువ రూ. 3,75,000/- కాగా, వీటిని గ్రామీణ ప్రాంతాల్లో డోర్ టు డోర్ చెత్త సేకరణ, చెత్త తరలింపు మరియు శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ కోసం వినియోగించనున్నట్లు తెలిపారు.గ్రామీణ పారిశుధ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే రోజువారీ చెత్త సేకరణ తప్పనిసరి అని, ఈ–ఆటోల వినియోగం ద్వారా గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు గణనీయంగా మెరుగుపడతాయని అన్నారు. పరిశుభ్రమైన గ్రామాలు ఆరోగ్యవంతమైన సమాజానికి పునాదిగా నిలుస్తాయని, ప్రజలు చెత్తను వేరు చేసి అందజేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని,ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ మెరుగుపడి, స్వచ్ఛ గ్రామాలు – ఆరోగ్యకర గ్రామాలు లక్ష్యం సాకారం అవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ, పంచాయతీ ప్రతినిధులు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :