నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 05 : తంబళ్లపల్లె మండల కేంద్రం సమీపంలోని మల్లయ్య కొండ శివాలయం లో జరిగిన కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజకు రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ ఈఓ మునిరాజ, మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, సిద్ధమ్మ, ఉత్తమ రెడ్డి, టి.డి.పి నాయకులు సాంప్రదాయబద్ధంగా సన్మానించి ఘనస్వాగతం పలికారు. హరితమ్మ మహాశివునికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి ఆలయ ప్రాంగణంలో మహిళలతో కలిసి నిరాడంబరంగా కార్తీక పౌర్ణమి నోమును భక్తిశ్రద్ధలతో నోచుకున్నారు. అనంతరం గౌరీ మాత ఆలయం, వీరన్న గెవి, స్వామి వారి పుష్కరిణి, నిచ్చెన కొండ, భగీరథి, వెలుగు మల్లమ్మ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లయ్య కొండ మరింత అభివృద్ధి చెంది రాష్ట్ర ప్రజలు ఆ మహాశివుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించినట్లు ఆమె తెలిపారు. ఆమె వెంట ఎస్సై ఉమామహేశ్వర్ రెడ్డి, ఆలయ రికార్డ్ అసిస్టెంట్ కొండకిట్ట,ఆనంద నాయుడు, టిడిపి నాయకులు, మహిళలు, పాల్గొన్నారు.
Reporter
Namitha News