నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 25 : టీనేజీ ఆడపిల్లల నడవడికలపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని ఎస్సై టి అనిల్ కుమార్ హెచ్చరించారు. శనివారం ఐకెపి కార్యాలయంలో గంగాధర్ ఆధ్వర్యంలో మహిళా చట్టాలు,సైబర్ నేరాల అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మహిళలు చట్టాలపై అవగాహనతో పాటు బాధ్యతాయుతమైన ప్రవర్తన పెంపొందే లక్ష్యంగా సహకరించాలన్నారు. ఫోక్సో చట్టం పై అవగాహన పెంచుకోవాలన్నారు. మహిళలు తమ పిల్లల భద్రత కోసం శక్తి యాప్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. శక్తి టీం సభ్యులు బి.ముని కుమార్ నాయక్, శశికళ లు టీనేజీ వయసులో ఆకర్షణలకు నియంత్రించకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు, వాటికి సంబంధించిన కేసు స్టడీస్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, సెల్ ఫోన్ల ద్వారా జరుగుతున్న మోసాలు మరియు వాటి పట్ల అప్రమత్తత, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వల్ల జరిగే దుష్ప్రభావాలు, మహిళలు మరియు పిల్లల భద్రత కోసం అందుబాటులోకి వచ్చిన శక్తి యాప్ ఉపయోగాలు వివరించి అత్యవసర సహాయం కోసం 1930,112,1098 టోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించాలన్నారు. మహిళలు చదువు ద్వారా వ్యక్తిగత స్థాయి పెరగడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు గురి చేయకుండా బాధ్యతగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ రమణమ్మ, ఎస్ఐ నజీర్ భాష, టిడిపి నాయకులు బేరి శ్రీనివాసులు, పురుషోత్తం, కసెట్టి వెంకటరమణ, సీసీలు కత్తి నరసింహులు, రమణ, పోలీస్ సిబ్బంది, అంగన్వాడీలు, ఐకెపి మహిళలు పాల్గొన్నారు
Reporter
Namitha News