Tuesday, 09 June 2026 08:24:54 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

దేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రిగా ఎదిగిన నాయకుడు దామోదరం సంజీవయ్య

జిల్లా సంయుక్త కలెక్టర్ శివ నారాయణ శర్మ ఆధ్వర్యంలో దామోదర్ సంజీవయ్య 105వ జయంతి వేడుకలు

Date : 14 February 2026 07:20 PM Views : 114

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 14 : దామోదరం సంజీవయ్య జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సేవా దృక్పథాన్ని పెంచుకోవాలని, దేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రిగా ఎదిగిన నాయకుడు దామోదరం సంజీవయ్య అని సంయుక్త కలెక్టర్ శివ నారాయణ శర్మ పేర్కొన్నారు. శనివారం ఉదయం మదనపల్లి కలెక్టరేట్లోని పి జి ఆర్ ఎస్ హాల్లో దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు

ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ శివ నారాయణ శర్మ మాట్లాడుతూ.... దామోదరం సంజీవయ్య దళిత కుటుంబంలో పేదరికంలో పుట్టాడని, అట్టడుగు స్థాయి నుండి దేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా, కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పదవులను అధిరోహించి తన జీవితాన్ని సమాజం కోసం త్యాగం చేశారన్నారు. మద్రాసు లో లా చదువుకొని తర్వాత రాజకీయాలలోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి స్థాయికి మరియు కేంద్ర మంత్రివర్గంలో పనిచేసే స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ ప్రెసిడెంట్ గా రెండేళ్లు పనిచేశారని, ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాదులో ఉన్న సంజీవయ్య పార్కుకు ఆయన జ్ఞాపకార్థం సంజీవయ్య పార్క్ అని నామకరణం చేశారన్నారు. అలాగే విశాఖపట్నంలోని లా విశ్వవిద్యాలయాన్ని ఆయన జ్ఞాపకార్థం దామోదరం సంజీవయ్య లా విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారన్నారు. టీచర్లకు పింఛన్లు అందుతున్నాయి అంటే దానికి కారణం దామోదరం సంజీవయ్య అని, బడుగు బలహీన వర్గాలకు భూమి అందేలా ఎన్నో భూ సంస్కరణలను చేపట్టారని పేర్కొన్నారు. ఆయన జీవితాంతం సమాజ హితం కోసం పోరాడారన్నారు. పాఠశాల విద్యార్థులందరూ దామోదరం సంజీవయ్య జీవితం నుంచి స్ఫూర్తి పొంది, సమాజానికి ఉపయోగపడే పనులను చేయాలని సూచించారు. జిల్లా విజిలెన్స్ మరియు పర్యవేక్షణ కమిటీ సభ్యులు, ఎమ్మార్పీఎస్ సభ్యులు మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలను జిల్లా కలెక్టరేట్లో జరుపుకోవడం సంతోషదాయకమని పేర్కొన్నారు. తన తల్లి నుండి స్ఫూర్తి పొంది సామాజిక పింఛన్లను ప్రారంభించిన మొదటి నాయకుడు దామోదరం సంజీవయ్య అని పేర్కొన్నారు. దాదాపు ఆరు లక్షల ఎకరాలను బడుగు బలహీన వర్గాలకు పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. రాష్ట్రంలో ఏసీబీ సంస్థ ఏర్పాటు ఆయన వల్లనే సాధ్యమైందని కొనియాడారు

ఈ సమావేశంలో డిఆర్ఓ మధుసూదన్ రావు, కురబ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటరమణ, కుమ్మరి మరియు శాలివాహన డైరెక్టర్ భావన, డివిఎంసి కమిటీ సభ్యులు శ్రీనివాసులు, చంద్రశేఖర్, మాల మహానాడు నాయకులు సుదర్శనం, ఎమ్మార్పీఎస్ నాయకులు నరేంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది, సాంఘిక సంక్షేమ పాఠశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :