నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 13 : స్థానిక టీడీపీ నాయకుడు దొమ్మలపాటి విశ్వనాధ్ నాయుడు మృతి చెందడం పార్టీకి తీరని లోటని, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు అన్నారు. నేడు విశ్వనాధ్ భౌతికకాయానికి ఘణ నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకుడు తాళ్ల బాబు తల్లి అయిన నాగలక్ష్మమ్మ అకాల మరణం చెందగా, విషయం తెలుసుకున్న శ్రీరామ్ చినబాబు, ఈశ్వర్మ కాలనీ లోని తాళ్ల బాబు ఇంటికి చేరుకొని నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఓదార్చారు
Reporter
Namitha News