నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 25 : తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఇంచార్జి లేకపోవడంతో కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక సంస్థలు ముంచుకొస్తున్న వేళ వెంటనే ఇంచార్జి నియమించి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని టిడిపి జిల్లా కార్యదర్శి సీనియర్ నాయకుడు కసెట్టి వెంకటరమణ, మండల బీసీ నాయకుడు పురుషోత్తం, మహిళా నాయకురాలు రామలక్ష్మమ్మ కోరారు. ఈ విషయమై టిడిపి నాయకులు, కార్యకర్తల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని టిడిపి జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల వైకాపా పాలనలో టిడిపి నాయకులు, కార్యకర్తలు వారి దౌర్జన్యాలు, అక్రమ కేసులు, భూ దందాలు, అన్ని రకాల దోపిడీలతో నరకం చూసామని నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తంబళ్లపల్లెలో ఇన్చార్జి లేకపోవడంతో వైకాపా నాయకుల ఆగడాలు మితిమీరుతున్నాయని ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తంబళ్లపల్లి నియోజకవర్గంలో దృష్టి సారించి మీరు ఎవరికి ఇంచార్జ్ బాధ్యతలు అప్పజెప్పిన శిరోధార్యంగా వ్యవహరిస్తామని వినతి పత్రంలో తెలిపారు
Reporter
Namitha News