నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి జిల్లా సాధన జేఏసీ ఉద్యమాలతోనే మదనపల్లి జిల్లా సాకారం అయ్యింది... బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతం... మదనపల్లి జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో నేడు మదనపల్లె పట్టణంలో పెద్ద ఎత్తున బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతం కుమార్ ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా ఉద్యమకారుల విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ టిప్పు సుల్తాన్ గ్రౌండ్ నుండి ప్రారంభమై స్థానిక ఆర్టీసీ బస్టాండ్ అంబేడ్కర్ సర్కిల్ వరకు సాగింది. అంబేడ్కర్ సర్కిల్లో నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ... గత వైసీపీ ప్రభుత్వంలో అదే రోడ్లపై అనేక పోరాటాలు అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టామని, నిర్బంధనలు, అరెస్టులకు కేసులకు భయపడలేదని... వీరు తెలిపారు. బందెల గౌతమ్ కుమార్ , యమలా సుదర్శనం మాట్లాడుతూ.. ప్రజా పోరాటాలను ప్రజాభిప్రాయాలను పెడచెవును పెడితే ఎలాంటి గతి పడుతుందో వైసిపి రుచి చూసిందని... మదనపల్లి జిల్లా అభివృద్ధిలో ఎలాంటి వెనుకంచ లేకుండా చేయాలని వీరు సూచించారు. భవిష్యత్తులో మదనపల్లి జిల్లా అభివృద్ధి జేఏసీ ఏర్పాటు చేసి మరిన్ని సమస్యలపై స్పందిస్తామని వీరు తెలియజేశారు. బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు, సిపిఐ కృష్ణప్ప, మురళి, సాంబ, కాంగ్రెస్ పార్టీ రెడ్డి సాహెబ్, మాట్లాడుతూ... జేఏసీలో పాల్గొన్న శాసనసభ్యులు షాజహాన్ భాష , మాజీ శాసనసభ్యులు దొమలపాటి రమేష్ , జనసేన నాయకులు రామ్ దాస్ , మదనపల్లి జిల్లా సాధన ఉద్యమాన్ని ప్రారంభించిన పిటిఎం శివ ప్రసాద్, ఎంఆర్పీఎస్ నరేంద్ర లు కలిసి పోరాటం చేస్తే మదనపల్లె జిల్లా సాకారం అయిందని మదనపల్లె జిల్లా సాధన జే ఏ సి ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించి పోరాట సాగించిందని ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు అంబేద్కర్ సాక్షిగా ఎన్నో పోరాటాలకు సాక్షి భూతంగా నిలిచిన అంబేడ్కర్ సర్కిల్ లోనే విజయోత్సవ సభ నిర్వహించడం సంతోషకరమని వీరు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాస్ నాయకులు ముత్యాల మోహన్ , మాలమహానాడు నాయకులు గుండా మనోహర్, పెద్ద ఎత్తున బిఎస్పి పార్టీ కార్యకర్తలు మదనపల్లి ప్రజలు యువత పాల్గొన్నారు....
Reporter
Namitha News