Wednesday, 17 June 2026 02:53:39 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

మెడికల్ మాఫియా దందాకు అడ్డుకట్ట వేయాలి – ఏఐవైఎఫ్, సీపీఐ డిమాండ్

Date : 30 April 2026 04:29 PM Views : 166

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మెడికల్ మాఫియా దందాకు అడ్డుకట్ట వేయాలి లైసెన్స్ లేని మెడికల్ షాపులు వెంటనే సీజ్ చేయాలి – ఏఐవైఎఫ్, సీపీఐ డిమాండ్ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న మెడికల్ మాఫియా అక్రమాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మదనపల్లిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి జక్కల వెంకటేష్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి టీ. కృష్ణప్ప, ఏరియా కార్యదర్శి పీ. మురళీ మాట్లాడుతూ జిల్లాలో అనుమతులు లేని ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అవసరం లేకున్నా టెస్టులు చేయించి వేల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. జిల్లాలో ఉన్న అన్ని మెడికల్ స్టోర్ల వివరాలు, లైసెన్సుల స్థితి, అనుమతి లేకుండా నడుస్తున్న దుకాణాలపై పూర్తి వివరాలతో జాబితా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే వైద్య సేవలు, పరీక్షలు, ఔషధాలపై ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను పట్టిక రూపంలో రూపొందించి ప్రతి ఆసుపత్రిలో ప్రదర్శించాలని కోరారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి దందాలకు పాల్పడుతున్న మెడికల్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అనుమతిలేని అబార్షన్ మాత్రల విక్రయదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లైసెన్స్ లేని మెడికల్ స్టోర్లను తక్షణమే సీజ్ చేసి, అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, మెడికల్ షాపులపై ప్రత్యేక దాడులు నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు సక్రమంగా అందకపోవడం ఆందోళనకరమని తెలిపారు. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థో విభాగం ఉన్నప్పటికీ శస్త్రచికిత్సలు జరగకపోవడం, వైద్యులు ప్రైవేట్ క్లినిక్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడం దురదృష్టకరమని విమర్శించారు. ఆసుపత్రిలో ఈఎన్టీ వైద్యుడిని నియమించి, తగిన సిబ్బందిని ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్యం అందించాల్సిందిగా డిమాండ్ చేశారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కె. మాధవ్, మునెప్ప, మునిరత్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: