Monday, 03 August 2026 06:43:48 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

మెడికల్ మాఫియా దందాకు అడ్డుకట్ట వేయాలి – ఏఐవైఎఫ్, సీపీఐ డిమాండ్

Date : 30 April 2026 04:29 PM Views : 193

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మెడికల్ మాఫియా దందాకు అడ్డుకట్ట వేయాలి లైసెన్స్ లేని మెడికల్ షాపులు వెంటనే సీజ్ చేయాలి – ఏఐవైఎఫ్, సీపీఐ డిమాండ్ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న మెడికల్ మాఫియా అక్రమాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మదనపల్లిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి జక్కల వెంకటేష్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి టీ. కృష్ణప్ప, ఏరియా కార్యదర్శి పీ. మురళీ మాట్లాడుతూ జిల్లాలో అనుమతులు లేని ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అవసరం లేకున్నా టెస్టులు చేయించి వేల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. జిల్లాలో ఉన్న అన్ని మెడికల్ స్టోర్ల వివరాలు, లైసెన్సుల స్థితి, అనుమతి లేకుండా నడుస్తున్న దుకాణాలపై పూర్తి వివరాలతో జాబితా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే వైద్య సేవలు, పరీక్షలు, ఔషధాలపై ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను పట్టిక రూపంలో రూపొందించి ప్రతి ఆసుపత్రిలో ప్రదర్శించాలని కోరారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి దందాలకు పాల్పడుతున్న మెడికల్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అనుమతిలేని అబార్షన్ మాత్రల విక్రయదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లైసెన్స్ లేని మెడికల్ స్టోర్లను తక్షణమే సీజ్ చేసి, అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, మెడికల్ షాపులపై ప్రత్యేక దాడులు నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు సక్రమంగా అందకపోవడం ఆందోళనకరమని తెలిపారు. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థో విభాగం ఉన్నప్పటికీ శస్త్రచికిత్సలు జరగకపోవడం, వైద్యులు ప్రైవేట్ క్లినిక్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడం దురదృష్టకరమని విమర్శించారు. ఆసుపత్రిలో ఈఎన్టీ వైద్యుడిని నియమించి, తగిన సిబ్బందిని ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్యం అందించాల్సిందిగా డిమాండ్ చేశారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కె. మాధవ్, మునెప్ప, మునిరత్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :