నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 17 : తంబళ్లపల్లె మండల కేంద్రం నడిబొడ్డులో టిడిపి వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు శనివారం టిడిపి నాయకులు భూమి పూజ చేసి శ్రీకారం చుట్టారు. తహసీల్దార్ కార్యాలయం మొలకలచెరువు రోడ్డు సర్కిల్లో ఎనిమిది అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుకు దిమ్మె నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు మణి, మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, మండల యువగళం నేత బాలాజీ, నాగార్జున, చంద్రమోహన్, పురుషోత్తం, వీరాంజనేయులు, బాలకృష్ణారెడ్డి, శివకుమార్, వెంకటరమణ, సోమశేఖర్, శివకృష్ణ, మాజీ సర్పంచులు సుధాకర్, శంకర్, కాలా నారాయణ, రెడ్డప్ప, ఎమ్మార్పీఎస్ వేటా మల్లికార్జున,అల్లావుద్దీన్, రామ్మోహన్ రెడ్డి, శ్రీనివాసులు, ఐసుల కృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News