నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 29 : అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని నీరుగట్టు వారి పల్లి నందు వెలసియున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం నందు నూతనంగా ఏర్పాటు చేసిన "ద్వజస్తంభ ప్రతిష్ట" కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. చినబాబు ను సాధారంగా ఆహ్వానించిన ఆలయకమిటీ సభ్యులు, స్వామి వారిని దర్శించుకొన్న శ్రీరామ్ చినబాబు వేదంపండితుల ఆశీర్వాదం పొందారు. ఈ సందర్బంగా పాలకమండలి సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా శ్రీరాం చినబాబు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News