Sunday, 02 August 2026 03:40:23 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర

Date : 16 June 2026 11:18 PM Views : 88

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 16 : ఇండియన్ బ్యాంక్ ల ఆర్థిక లావాదేవీల తో పాటు అభివృద్ధిలో వెలుగు సంఘమిత్రలదే కీలకపాత్ర ని ఇండియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఇందిర ప్రశంసించారు. సోమవారం వెలుగు కార్యాలయంలో ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో వెలుగు సంఘమిత్రల సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తంబళ్లపల్లె, కోసువారిపల్లె ఇండియన్ బ్యాంకుల పరిధిలో మహిళా సంఘాలు రుణాల సద్వినియోగంలో సత్ఫలితాలు సాధించినట్లు చెప్పారు. బ్యాంకు లింకేజీ తో పాటు పలు రకాల రుణాలను అందించడానికి బ్యాంకులు సహకరిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆర్థిక ఏడాదిలో 33 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ కి వెలుగు ఏపిఎం తోబాటు సీసీలు, వివో లీడర్లు, సభ్యులు, సంఘమిత్రలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా బ్యాంక్ పరంగా మహిళా సంఘాల సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బ్యాంకు రుణాలు పంపిణీలో పారదర్శకత పాటించి భవిష్యత్తులో ప్రతి మహిళ లక్షాధికారి కావడమే లక్ష్యంగా తమ సహకారం ఉంటుందన్నారు. ఏపీఎం మాట్లాడుతూ ఇండియన్ బ్యాంక్ లు మహిళా సంఘాలకు అందించిన రుణ సౌకర్యంపై కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో మరింత ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లె, కోసువారిపల్లి మేనేజర్లు ఎస్ ఎన్ డి మంజూర్ ఇలాహి, నాగరాజు, ఐకెపి అధ్యక్షురాలు రామ లక్ష్మమ్మ,సీసీలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, వివో లీడర్లు, సంఘమిత్రలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :