నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 23 : గత భూ రీసర్వే తప్పుల తడకని కూలంకషంగా క్షేత్రస్థాయిలో రైతులతో సమీక్షించి ప్రక్షాళన చేయాలని రెవెన్యూ అధికారులను తాసిల్దార్ శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం ఆయన మండలంలోని రేణుమాకులపల్లి, కోటకొండ, కుక్క రాజుపల్లి పంచాయతీలలో సుడిగాలి పర్యటన చేసి భూ రీ సర్వే పై రెవెన్యూ అధికారుల పరిశీలనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూరీసర్వే లో రేణుమాకులపల్లె రైతుల నుండి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం ఇద్దరు మండల సర్వేలు, నలుగురు గ్రామ సర్వేయర్లు, వీఆర్వోలను సర్వేకు ఆదేశించినట్లు చెప్పారు. మండలంలో గత భూ రీసర్వేలో వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడమే ధ్యేయంగా మండల రెవెన్యూ అధికారులను పురమాయించి పూర్తిస్థాయిలో పక్క పాస్ బుక్కులు పంపిణీ ప్రణాళికకు కట్టుబడి ఉన్నట్లు తాసిల్దార్ తెలిపారు. ఆయన వెంట సర్వేయర్లు, వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు
Reporter
Namitha News