నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 17 : తంబళ్లపల్లె మండలం లోని రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని ఏఈఓ సురేష్ సూచించారు. మంగళవారం ఏవో రమణకుమార్ ఆదేశాల మేరకు తంబళ్లపల్లె పంచాయతీ ఇట్నేని వారిపల్లెలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల ఎలినినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని రైతులు ముందస్తుగా ఆరుతడు పంటలే ఎంచుకోవాలన్నారు. పిఎండిఎస్ ద్వారా భూమిని కప్పి ఉంచి భూములను తేమను కాపాడు కోవాలన్నారు. అనంతరం రైతులకు వ్యవసాయానికి సంబంధించి పంచ సూత్రాలను విసదీకరించారు. ఈ కార్యక్రమం ఆరు రోజులు పాటు జరుగుతుందని రైతులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు
Reporter
Namitha News