Thursday, 16 April 2026 08:02:12 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ఎంపి మిధున్ రెడ్డి చేసిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది

Date : 13 November 2025 05:01 PM Views : 51

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : ఎంపి మిధున్ రెడ్డి చేసిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది... అభివృద్ధికి చిరునామా రాజంపేట పార్లమెంటు -- మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ స్పష్టం -- ఎంపి మిధున్ రెడ్డి ని విమర్శించే స్దాయి మీది కాదు... ఆర్‌జె వెంకటేష్ కు కౌంటర్ ఇచ్చిన నిస్సార్ అహమ్మద్... ఎన్నో విమర్శలు చేయవచ్చు... ఒకటిన్నర సంవత్సరంలో మీరు చేసింది శూన్యం... రాజంపేట పార్లమెంటు సభ్యులు పివి మిధున్ రెడ్డి నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, చేసిన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పేర్కొన్నారు. ‌గురువారం మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీలో కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్, పరిశీలకులు అనూష రెడ్డి హజరైనారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ రాజంపేట పార్లమెంటు సభ్యులు పివి మిధున్ రెడ్డి పై విమర్శలు చేసేవారు నియోజకవర్గ అభివృద్ధి కూడా చూడాలని హితవు పలికారు. టిడిపి నాయకులు ఆర్‌జె వెంకటేష్ మిధున్ రెడ్డి పైన విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని, వైసిపి ప్రభుత్వం హయ్యాంలో అటవీ భూముల విషయంలో మీకు సమస్య వస్తే ఎంపి ఇంటి దగ్గర కాసుకుని వుండి పనులు చేయించుకోలేదా అని ప్రశ్నించారు. ఎంపి మిధున్ రెడ్డి ని విమర్శించే స్దాయి మీది కాదని అన్నారు. మదనపల్లె నియోజకవర్గంలో మిధున్ రెడ్డి మార్క్ అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజ్, కేంద్రీయ విద్యాలయం, ఎంపి నిధులతో చేనేత భవన్, నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు, కరోన కష్టకాలంలో ఆక్సిజన్ సిలెండర్లు, ఇలా ఎన్నో మిధున్ రెడ్డి చోరవతో వచ్చాయని వివరించారు. ‌విమర్శలు చేసే ముందు చేసిన అభివృద్ధి కూడా చూడాలని సూచించారు. ‌ఎడాదిన్నర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించారు. ఒక్క రోడ్డు అయినా వేశరా అని ప్రశ్నించారు. ‌మెడికల్ కాలేజీలు పిపిపి విధానంలో చేపడితే అన్ని విధాల నష్టం చేకూరుతుందని అన్నారు.‌ ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :