నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - ఆగస్ట్ 01: మల్లయ్య కొండ లో ప్రతిపాదిత మైనింగ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు సాదుకొండను మేళ తాళల లతో అధిరోహించి మైనింగ్కు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించారు. కొండలను, అటవీ సంపదను, పర్యావరణాన్ని పరిరక్షించాలని, స్థానిక ప్రజల మనోభావాలను గౌరవిస్తూ మైనింగ్ ప్రతిపాదనను పూర్తిగా విరమించుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, రైతులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
Reporter
Namitha News