Thursday, 30 April 2026 09:20:50 PM
# జాతీయ స్థాయి లో యన్.సి.సి. లో ప్రతిభ కనబర్చిన మిట్స్ విద్యార్థులు # పది ఫలితాల్లో జిల్లా ప్రధమ స్థానంలో కొర్రకూటి యస్విత # మెడికల్ మాఫియా దందాకు అడ్డుకట్ట వేయాలి – ఏఐవైఎఫ్, సీపీఐ డిమాండ్ # మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల కు ఘన నివాళులు - ఏ.యం.సి. ఛైర్మన్ జంగాల శివరాం # వివాహా వేడుకలలో శ్రీరాం చినబాబు # అయ్యప్ప స్వామి ద్వజస్తంభన కార్యక్రమం లో శ్రీరామ్ చినబాబు # శ్రీరాం చినబాబు కు బ్రహ్మరథం పట్టిన ఆర్. నడింపల్లి తెలుగుదేశం కార్యకర్తలు # కన్నప్రేగుకు భారమైన పురిటిబిడ్డను వదిలేసిన మాతృమూర్తి ఎవరు ... ? # నారా లోకేష్ టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం లో ఎమ్మెల్యే షాజహాన్ # నమిత న్యూస్ కార్యాలయం ప్రారంభోత్సవం లో కృష్ణ చరణ్ # గ్రీన్ అంబాసిడర్లు చెత్తను డంపింగ్ యార్డ్ తరలించాలి -ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ # గొయ్యి తవ్వారు... ప్రమాద సూచిక బోర్డు ఎక్కడ... ! # నిచ్చెనకొండ పుణ్య జలాలు శివయ్య చెంతకు చేరాయి # పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు ఉండరాదు # రిలయన్స్ ఫౌండేషన్ మెరిట్ స్కాలర్ షిప్ ఎంపికైన మిట్స్ విద్యార్థులు # మృతిని కుటుంబం నకు ఆర్థిక సాయం అందించిన టిడిపి నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు # జర్నలిస్ట్ హత్య ను నిరసిస్తూ పుంగనూరు పట్టణం లోని జర్నలిస్ట్లు ఆందోళన, నిరసన # వి.కోట లో విలేకరి జగన్ దారుణహత్య # ఈదురు గాలులకు కూలిన రేకుల షెడ్డు # మహిళా ఆర్థిక అభివృద్ధికి యగ్ కార్ట్ చేయూత - ఏపిఎం గంగాధర్

పెద్ద చెరువు కట్టను కబ్జాల నుండి కాపాడండి - సిపిఐ

Date : 25 April 2026 03:32 PM Views : 68

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. . కొత్తకోట - ఏప్రిల్ 25 : బి.కొత్తకోట నగర పంచాయతీ పరిధిలోని పట్టణానికి ఆనుకొని ఉన్న పెద్ద చెరువు కట్టను కబ్జాల నుండి కాపాడాలని సిపిఐ తంబళ్లపల్లె నియోజకవర్గపు కార్యదర్శి యస్.మనోహర్ రెడ్డి,బి.కొత్తకోట మండల కార్యదర్శి జి.రఘునాథ్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెరువు కట్ట కబ్జా విషయం మీద శనివారం మండల తహసిల్దార్ కార్యాలయం నందు రెవెన్యూ అధికారులకు మెమోరాండం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ;బి.కొత్తకోట చెరువు కట్టను చెరువు కింద ఉన్నటువంటి భూస్వాములు తమ భూమిని ఎత్తు పెంచుకొని వానిజ్య సముదాయాలు నిర్మించుకునేందుకుగాను, పట్టణంలోని వేస్ట్ మట్టిని ట్రాక్టర్ల ద్వారా కట్టమీద నుండి తమ పొలాల్లోకి తరలించి,జెసిబిల ద్వారా చదును చేయించి చెరువు కట్టను ఆనవాళ్లు లేకుండా కబ్జా చేస్తున్నారని ఆవేదన చెందారు.ఇప్పటికే చదునుచేసిన స్థలంలో వాణిజ్య కేంద్రాలు ఏర్పాటు చేసి అద్దెలకు ఇచ్చారని అన్నారు.చెరువు తూము నుండి ఆయకట్టు కోసం నీరు పారే కాలువలు కూడా మూసివేసారని మండిపడ్డారు.ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం చెరువులు,కుంటలు నీటితో నింపడానికి కాలువలు,చెరువు కట్టలు మరమ్మత్తులు చేపట్టాలని,అన్ని చెరువులనూ నీటితో నింపడానికి తగు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినా కూడా,ప్రతిరోజూ అధికార యంత్రాంగం ప్రయాణించే రహదారిలో ఉన్న పెద్ద చెరువు కట్ట కబ్జాలు కనపడుతున్నా కూడా వారికి ఏమీ పట్టనట్లు వ్యవహరించడం,కనీస చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయని వారన్నారు.సదరు కబ్జాల సాకుతో కట్టకింద ఉన్న మిగిలిన భూ యజమానులు కూడా అదే విధంగా కట్టను కబ్జా చేసే ప్రమాదం పొంచి ఉన్నదని,ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకుని సదరు కబ్జాలను తొలగించి చెరువు యొక్క తూములను,కాలువలను కాపాడాలని,లేకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చెరువుకట్ట మీదనే ఆందోళనలకు శ్రీకారం చుడతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఏస్.తంబయ్యశెట్టి,చెన్నకేశవులు పాల్గొన్నారు

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :