నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - నవంబర్ 22 : తంబళ్లపల్లె మండలం రామిగానిపల్లె వద్ద ఈనెల 15న చైన్ స్నాచింగ్కి పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు యస్.ఐ. ఉమా మహేశ్వరరెడ్డి తెలిపారు. శుక్రవారం కుక్కరాజుపల్లె క్రాస్ వద్ద నిందితులు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం విరువురుకు చెందిన కాశిరెడ్డి 21 సం మరియు కడప జిల్లా CK.దిన్నె మండలం గురుగుపుడు తండాకు చెందిన సతీశ్ 25 సం " ను అరెస్ట్ చేశారు. వారివద్ద నుండీ 36 గ్రాముల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.
Reporter
Namitha News