Friday, 31 July 2026 02:35:45 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

హార్సిలీ హిల్స్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

Date : 08 May 2026 08:28 PM Views : 131

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 08 : ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన హార్సిలీ హిల్స్ లో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మదనపల్లి లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తో కలిసి ఆర్ అండ్ బి, పర్యాటక శాఖ, డిపిఓ, విద్యుత్తు శాఖ, కొత్తకోట ఎంపీడీవో, ఎమ్మార్వో తదితర శాఖల తో సమావేశంలో నిర్వహించి హార్సిలీ హిల్స్ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ..పర్యాటకులను ఆకర్షించే విధంగా మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గాలి బండ ప్రాంతంలో గాజు పెంకులు, ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని, ఆ ప్రాంతంలో డస్ట్ బిన్లను ఏర్పాటు చేయాలని, ప్లాస్టిక్ వాడకం పై నిషేధం బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు.రోడ్లు, పార్కుల అభివృద్ధి, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్లు,పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాలు, పచ్చదనం పెంపు, వీక్షణ స్థలాల అభివృద్ధి వంటి పనులపై అధికారులతో చర్చించారు. హార్సిలీ హిల్స్ కు వచ్చే పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారా పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలని, పరిశుభ్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో సంబంధిత శాఖల సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు

ఈ సమావేశంలో సంబంధిత శాఖల డిపిఓ రాధమ్మ, పర్యాటకశాఖ అధికారి నాగభూషణం, విద్యుత్ శాఖ, ఆర్ అండ్ బి, కొత్తకోట ఎమ్మార్వో, మండల అభివృద్ధి అధికారి కార్యాలయ అధికారులు,తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: