నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 20 : తంబళ్లపల్లె మండలంలోని పంచాయితీలకు వచ్చే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయకుండా కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ వినోద్ కుమార్ సూచించారు. శనివారం ఏవో థామస్ రాజా ఆధ్వర్యంలో మండలంలోని సచివాలయ సిబ్బందితో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ పంచాయతీలకు వచ్చిన 16వ ఆర్థిక ప్రణాళిక నిధులు తాగునీరు, పారిశుద్ధ్యనికి పెద్దపీట వేయాలని పంచాయతీలోని ప్రతి పైసా ప్రజా సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయాలని సూచించారు. మండలంలో తాగునీటి సమస్యలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ ఎంపీడీవోలు మారుతీ కుమార్, ప్రసాద్, మండలంలోని కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News