నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 23 : వయోజనులు ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగి ఉండాలని విడ్స్, సి ఎఫ్ ఎల్ ప్రతినిధి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ సిటిజెన్లకు ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంకుల్లో అకౌంట్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఇందుకు వాలంటరీ ఇంటిగ్రేటెడ్ సొసైటీ మరియు ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు సహకరిస్తాయి అన్నారు. భీమా పథకాలపై అవగాహన పెంచుకోవాలని అదేవిధంగా సైబర్ నేరాలు, లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, నష్టాలపై అప్రమత్తంగా ఉండాలని ఇందుకు సంబంధించి పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్, సి ఎల్ ఎఫ్ ప్రతినిధి హరికృష్ణ, కార్యదర్శి శ్రీనివాసులు, పద్మావతి, భాస్కర్ సీనియర్ సిటిజెన్లు పాల్గొన్నారు
Reporter
Namitha News