నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 02 : తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలన్న టిడిపి నాయకుల కల ఎట్టకేలకు నెరవేరుతోంది. విగ్రహం ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ యువ నేతలు నాగార్జున, ధనుంజయ ల సహకారంతో టిడిపి నాయకులు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ములకలచెరువు రహదారి సర్కిల్లో సోమవారం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఓ శుభ ముహూర్తాన జిల్లాస్థాయి టిడిపి నాయకులచే ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరులకు తెలిపారు.
Reporter
Namitha News