నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 21 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగము వారు చెన్నై కి చెందిన రాంపెక్స్ టెక్నాలజీస్ కంపెనీ వారితో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ అన్నారు. విభాగాధిపతి డాక్టర్ ఎమ్.శ్రీదేవి మరియు రాంపెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ కె.ఎస్. ప్రశాంత్ లు అవగాహన ఒప్పందం పై సంతకాలు చేసినట్లు ఆయన అన్నారు. ఈ ఒప్పందము ద్వారా ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పరిశ్రమల ఆధారిత ఇంటర్న్షిప్లు, అకడమిక్ ప్రాజెక్ట్లు, ప్లేస్మెంట్ ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ ఆఫర్లలో అవకాశాలను అందించడం, విద్యా మరియు వృత్తిపరమైన వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన అన్నారు. ప్రస్తుత అధునాతన టెక్నాలజీ పై విద్యార్థులకు దినదినాభివృద్ధి నే తెలియజేయడం మరియు అప్లికేషన్ డెవలప్మెంట్పై హ్యాండ్-ఆన్ సెషన్ను నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో డీన్-స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, ఇండస్ట్రీ రిలేషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.ఎం. బాలాజీ, ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ ఆర్. సుధాకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News