Wednesday, 17 June 2026 02:35:03 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

సోలార్ విద్యుత్తు భవిష్యత్తులో ప్రతి ఇంటికి ఆదాయ వనరులే - విద్యుత్ ఏ.డి. గోవిందరెడ్డి

Date : 14 June 2026 08:56 PM Views : 40

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 14 ః కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో సోలార్ విద్యుత్తు కనెక్షన్ తీసుకుంటే భవిష్యత్తులో విద్యుత్ ఆదాతో పాటు ప్రతి కుటుంబానికి సోలార్ ఓ ఆదాయ వనరుగా మారుతుందని విద్యుత్ శాఖ ఏడి గోవిందరెడ్డి సూచించారు. ఆదివారం ఆయన ఏఈ సురేంద్ర తో కలిసి తంబళ్లపల్లె, గోపిదిన్నె సబ్ స్టేషన్లు పరిశీలించి విద్యుత్తు సరఫరాపై ఆరాతీశారు. వర్షాకాలం దృశ్య విద్యుత్ లైన్లు పై ట్రీ కటింగ్ చేపట్టి విద్యుత్ సమస్యలు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు , రైతుల విద్యుత్ మోటార్ల వద్ద విద్యుత్ సరఫరా పై ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఎ.డి తంబళ్లపల్లె, ఇట్నేని వారి పల్లి తో పాటు పలు చోట్ల సోలార్ విద్యుత్ యూనిట్లను పరిశీలించారు.సోలార్ లబ్ధిదారులు సోలార్ తో నిరంతర విద్యుత్ పొందడం తోపాటు బిల్లులు చెల్లించే పని లేకుండా మాకు అదనంగా డబ్బు ఆదా అవుతున్నట్లు చెప్పడం విశేషం. ఈ సందర్భంగా ఏ.డి మాట్లాడుతూ మండలంలో విద్యుత్ శాఖ సిబ్బంది లబ్ధిదారులకు ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకుని తద్వారా వారికి లభించే లబ్ధిపై అవగాహన కల్పించాలని సూచించారు. విద్యుత్ బిల్లులు సకాలంలో వసూళ్లపై సిబ్బంది దృష్టి సారించాలని విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో రైతులు, కక్షిదారులు సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన వెంట లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, లైన్మెన్ శంకర్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: