Sunday, 02 August 2026 03:40:08 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

సోలార్ విద్యుత్తు భవిష్యత్తులో ప్రతి ఇంటికి ఆదాయ వనరులే - విద్యుత్ ఏ.డి. గోవిందరెడ్డి

Date : 14 June 2026 08:56 PM Views : 93

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 14 ః కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో సోలార్ విద్యుత్తు కనెక్షన్ తీసుకుంటే భవిష్యత్తులో విద్యుత్ ఆదాతో పాటు ప్రతి కుటుంబానికి సోలార్ ఓ ఆదాయ వనరుగా మారుతుందని విద్యుత్ శాఖ ఏడి గోవిందరెడ్డి సూచించారు. ఆదివారం ఆయన ఏఈ సురేంద్ర తో కలిసి తంబళ్లపల్లె, గోపిదిన్నె సబ్ స్టేషన్లు పరిశీలించి విద్యుత్తు సరఫరాపై ఆరాతీశారు. వర్షాకాలం దృశ్య విద్యుత్ లైన్లు పై ట్రీ కటింగ్ చేపట్టి విద్యుత్ సమస్యలు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు , రైతుల విద్యుత్ మోటార్ల వద్ద విద్యుత్ సరఫరా పై ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఎ.డి తంబళ్లపల్లె, ఇట్నేని వారి పల్లి తో పాటు పలు చోట్ల సోలార్ విద్యుత్ యూనిట్లను పరిశీలించారు.సోలార్ లబ్ధిదారులు సోలార్ తో నిరంతర విద్యుత్ పొందడం తోపాటు బిల్లులు చెల్లించే పని లేకుండా మాకు అదనంగా డబ్బు ఆదా అవుతున్నట్లు చెప్పడం విశేషం. ఈ సందర్భంగా ఏ.డి మాట్లాడుతూ మండలంలో విద్యుత్ శాఖ సిబ్బంది లబ్ధిదారులకు ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకుని తద్వారా వారికి లభించే లబ్ధిపై అవగాహన కల్పించాలని సూచించారు. విద్యుత్ బిల్లులు సకాలంలో వసూళ్లపై సిబ్బంది దృష్టి సారించాలని విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో రైతులు, కక్షిదారులు సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన వెంట లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, లైన్మెన్ శంకర్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :