Thursday, 16 April 2026 08:01:01 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో మహిళల ఆరోగ్య పరిరక్షణ మరియు వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన

ఫెమి 9 ప్రతినిధులచే విద్యార్ధినులకు అవగాహన

Date : 04 December 2025 07:26 PM Views : 116

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 04 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఉమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ (WEC) వారి ఆధ్వర్యంలో తమిళనాడుకు చెందిన స్త్రీ సాధికారికత భారతదేశం ఫెమీ–9 సంస్థ ప్రతినిధులు మహిళల ఆరోగ్య పరిరక్షణ మరియు వ్యక్తిగత పరిశుభ్రత అనే అంశం పై విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కుప్పం కు చెందిన ఫెమి 9 - మేనుస్ట్రుల్ హైజీన్ ఎడ్యుకేటర్స్ అండ్ ఎంట్రప్రెన్యూర్స్ అనంత్.ఎం మరియు జయశ్రీ.కె పాల్గొన్నారు. కార్యక్రమంలో అనంత్ మాట్లాడుతూ మెన్స్ట్రుయేషన్‌కు సంబంధించిన అలవాట్లు, సవాళ్లు, హైజీనిక్ పద్ధతులు మరియు సురక్షిత శానిటరీ ఉత్పత్తుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. మహిళలు, ముఖ్యంగా గ్రామీణ మరియు వెనుకబడిన వర్గాల్లో ఉన్నవారు, శుభ్రమైన మరియు గౌరవప్రదమైన విధంగా మెన్స్ట్రుయేషన్‌ను నిర్వహించుకోవడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రపంచ మరియు దేశ స్థాయి గణాంకాలు ప్రదర్శిస్తూ, మెన్స్ట్రుయేషన్‌పై ఉన్న అపోహలు, అవగాహన లోపం కారణంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేశారు. ముఖ్యంగా భారతదేశంలో మహిళల క్యాన్సర్ కేసుల్లో పెరుగుదల ఆందోళన కలిగించే అంశమని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ ఛైర్‌పర్సన్ డాక్టర్ ఎస్. షణ్ముగ ప్రియా మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం మరియు వ్యక్తిగత పారిశుద్ధ్యం పై ప్రతి యువతికి అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్ కె.వి. గీతాదేవి, కె. కవిత, ఎం.బి.ఏ మరియు ఎం.సి.ఏ మొదటి సంవత్సరం విద్యార్థినిలు, యన్.ఎస్.ఎస్ వాలెంటీర్స్ పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :