నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 20 : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన అండర్ 17 హాకీ ఎంపిక పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన మట్లవారిపల్లె జడ్పీ హైస్కూల్ లో 9 వ తరగతి విద్యార్థిని టి. శ్రవంతి రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. వెంకటరమణ నాయుడు, పి. డి పార్థసారధి, ఉపాధ్యాయులు, తల్లి దండ్రులు,విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థిని శ్రవంతి రాష్ట్ర స్థాయిలోను అత్యుత్తమ ఫలితాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.
Reporter
Namitha News