నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 17 : రామసముద్రం గ్రామంలో జనవరి 7వ , 8వ తేదీలలో ముస్లిం సోదరుల ఇస్తిమా కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో మదనపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రవి నాయక్ ఇస్తిమా ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో సిఐ మాట్లాడుతూ భద్రతాపరమైన చర్యలపై ముందస్తు సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇస్తిమా జరుగుతున్న ప్రదేశంలో ముస్లిం మత పెద్దలు మరియు ముస్లిం కమ్యూనిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి, కార్యక్రమం శాంతియుతంగా సురక్షితంగా నిర్వహించుటకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమం జరిగే ప్రదేశంలో క్రమబద్ధమైన ప్రవేశం మరియు నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వాలంటీర్ల సహకారంతో క్యూలు నిర్వహించాలని , వాహనాలు పార్కింగ్ క్రమబద్ధంగా నిర్వహించాలని తెలిపారు. ఎటువంటి అపోహలు లేదా వివాదాలు తలెత్తకుండా పరస్పర సహకారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి రామసముద్రం ఎస్ఐ దిలీప్ కుమార్, పోలీస్ స్టేషన్ సిబ్బంది బాలాజీ, లోకేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News