నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 16 : తంబళ్లపల్లె నియోజకవర్గం లోని మహిళా సంఘాలు వార్షిక జీవనోపాదుల ప్రణాళికతో అభివృద్ధిపై ముందడుగు వేయడానికి సహకరించాలని సర్ఫ్ డిపిఎం సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం ఐకెపి కార్యాలయంలో ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ఏపీఎంలు, సీసీలు, ఎంఎస్ఓపిల అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా డిపిఎం సత్యనారాయణ మాట్లాడుతూ మహిళా సంఘాలు పొందిన రుణాలు ముందస్తు వార్షిక ప్రణాళికతో ఆర్థిక అభివృద్ధి కి విభిన్న వ్యాపారాలు, కోళ్ల పరిశ్రమ, చేపల పెంపకం, మినీ పరిశ్రమలు, ప్రకృతి వ్యవసాయ పంటలు, పలు రకాల లాభదాయక వ్యాపారాల పై దృష్టి సారించాలని సూచించారు. మహిళా సంఘాలు విభిన్న వ్యాపారాలతో ఆర్థిక అభివృద్ధి తో పాటు వ్యాపార మెలకువలు అలవర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. ఐకెపి అధికార యంత్రాంగం మహిళా సంఘాల వార్షిక జీవనోపాదులపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి భవిష్యత్తు లో మహిళా సంఘాల బలోపేతం తో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా వారిలో చైతన్యం నింపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎపిఎంలు రమణ, సుబ్రహ్మణ్యం, ఏజీఎం సంతోష్ కుమార్, ఇండియన్ బ్యాంక్ మేనేజర్లు ప్రవీణ్ కుమార్, నాగరాజు, ఆరు మండలాల ఏపీఎంలు, సీసీలు, ఎంఎస్ఓపిలు పాల్గొన్నారు
Reporter
Namitha News