Thursday, 30 July 2026 11:55:46 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

నిబంధనలు ఉల్లంఘిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్లపై చర్యలు తీసుకోవాలి

ఎక్సైజ్ మంత్రికి బహుజన యువసేన వినతి పత్రం

Date : 13 February 2026 04:48 PM Views : 239

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి పట్టణంలో పలు బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపులు ప్రభుత్వ నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని బహుజన యువసేన (BYS) రాష్ట్ర అధ్యక్షుడు జి. పునీత్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని నరసింహా బార్ అండ్ రెస్టారెంట్‌తో పాటు మరికొన్ని మద్యం దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. బార్ వెనుక ద్వారం గుండా అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, సమీపంలోని విద్యాసంస్థలు, ఆసుపత్రుల వల్ల విద్యార్థులు, రోగులు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహం సమీపంలో మద్యం సేవించి అపరిశుభ్రం చేయడం ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. గతంలో ఫిర్యాదులు, పత్రికా కథనాలు వచ్చినా చర్యలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన పునీత్ కుమార్, ప్రజారోగ్యం, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సంబంధిత బార్‌ను వెంటనే తొలగించడంతో పాటు నిబంధనలు అతిక్రమిస్తున్న ఇతర మద్యం దుకాణాలపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బహుజన యువసేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :